రేపల్లె న్యాయవాదుల సంక్షేమ సంఘం (బార్అసోసియేషన్)కు 2022-23 సంవత్స రానికి నూతన కార్యనిర్వాహక వర్గం ఎన్నికలకు 5 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి గుజ్జర్లమూడి ప్రశాంతకుమార్ తెలిపారు. రేపల్లె బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియల్లో భాగంగా తొలిరోజు అధ్యక్ష పదవికి 2, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కు 2, కోశాధికారికి 1 చొప్పున నామినేషన్లు అందాయన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోందన్నారు. 24న నామినేషన్ పరిశీలన, ఉపసంహరణ, 28న ఉదయం ఎన్నికల నిర్వహణ, అదేరోజు సాయంత్రం 4. 30 గంటలకు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa