అనంతపురం జిల్లాలో మూడు జాతీయ రహదారులు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం అనుమతులు మంజూరు చేశారు. నేషనల్ హైవే అధికా రులు తెలిపిన వివరాల ప్రకారం. బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ వరకు నాలుగు వరసల రోడ్డు 39 కిలోమీటర్లుకు (ఎన్హెచ్-42) రూ. 530 కోట్లు కేటాయించింది. కడప జిల్లాలోని ముద్దనూరు నుంచి హిందూపురం వరకు (ఎన్హెచ్ 716జి) సంబంధించి జిల్లాలోని బి. కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకు నాలుగు వరసల రోడ్డు 56 కిలోమీటర్లకు రూ. 800 కోట్లు కేటాయిం చింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు (ఎన్హెచ్ 342) రోడ్డుకు సంబంధించి ముద్దనూరు నుంచి బుక్కపట్నం వరకు పది మీటర్ల వెడల్పు కలిగిన డబుల్ లైన్ 32 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి రూ. 400 కోట్లును కేటాయించింది. ఈ మూడు రోడ్లు కూడా శ్రీ సత్యసాయి జిల్లాలో ఉండటం గమనార్హం. సుమారు రూ. 1730 కోట్లతో రోడ్డు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విజయవాడ నుంచి త్వరలోనే టెండర్లను స్వీక రించనున్నారు. వచ్చే మూడు నెలల్లో ఈ రోడ్డు పనులను చేపట్టనున్నట్లు నేషనల్ హైవే అధికారుల ద్వారా తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa