ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 03:15 PM

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌ సేవలు శుక్రవారం స్తంభించిపోవడంతో ఎస్‌బీఐ ఖాతాదారులు ఆందోళన చెందారు. దీంతో ఎస్‌బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 1న వార్షిక ఆర్థిక కార్యకలాపాల ముగింపు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయా సేవలు నిలిపి వేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ట్విట్టర్‌లో ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 1) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో ఆధారిత సేవలు నిలిపి వేసినట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల నివేదికలు, కొత్త కార్యకలాపాలపై ఈ రోజు బాధ్యతలను ఉద్యోగులు నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa