ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు. అదే చేశారు ఉత్తరప్రదేశ్ లోని అటవీ శాఖ అధికార్లు. ఉత్తరప్రదేశ్లో కోతుల బెడదను వదిలించడానికి అటవీ శాఖ అధికారులు వినూత్నంగా ప్రయత్నించారు. సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కోతులను పట్టుకోవడం, వాటిని బంధించడం చేస్తుంటారు. అయితే లక్నోలో చేసినట్టే ఇక్కడ కూడా అధికారులు కొత్త ఐడియాతో ముందుకు వెళ్లారు. అయితే విచిత్రంగా ఆ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. అటవీశాఖ అధికారులు మీరట్లో కోతులను తరిమేందుకు కొండముచ్చుల కటౌట్లను పెట్టారు. ఈ ప్రయోగం ఫలించిందని అధికారులు చెబుతున్నారు. కోతుల బెడద తగ్గి ప్రజలకు కొంత ఉపశమనం లభించిందని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేష్ కుమార్ చెప్పారు. “సాధారణంగా అడవి జంతువులు ఒకదానిపై ఒకటి కయ్యానికి దిగుతాయి. అందుకే పులి ఉన్నచోట చిరుత ఉండదు. కొండ ముచ్చుల ఉన్న చోట కోతులు తిరగడం మానేస్తాయి. ఈ సూత్రంతో కొండముచ్చుల కటౌట్లు పెట్టాం. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేలా కొన్ని మార్పులు చేస్తాం.." అని రాజేష్ కుమార్ అన్నారు. ఇటీవల కాలంలో మీరట్లో కోతులు బెడద బాగా పెరిగింది. కనిపించిన వారిపై దాడులు చేసేవి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి రాలేని దుస్థితి ఏర్పడింది. దీంతో స్థానిక ప్రజలు సమస్యను పరిష్కరించమని అధికారులను కోరారు. దీంతో ఆ కోతులను తరిమేందుకు అటవీ శాఖ అధికారులు ఓ ఉపాయం ఆలోచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ ముచ్చుల కటౌట్స్ను పెట్టారు. దీంతో కోతులు బెడద కొంత తగ్గిందని అధికారులు అంటున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో కటౌట్లను ఏర్పాటు చేశామని, కొన్ని మార్పులు చేసి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉంచుతామని రాజేష్ కుమార్ తెలియజేశారు. అయితే ఇదే కొత్త ఐడియా కాదు.. ఇంతకు ముందు లక్నోలో అధికారులు ఈ ప్రయోగాన్ని చేశారు. లక్నోలోని మెట్రో స్టేషన్లలో కొండముచ్చుల కటౌట్స్ను పెట్టి కోతుల బెడద తగ్గించారు. ఇప్పుడు దీనినే మీరట్లో కూడా అవలంబిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa