బాపట్ల జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర శాసనసభ డిప్యూటీవ్ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. సోమవారం బాపట్ల హెచ్. ఆర్. డి. ఐక్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీవ్ స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ప్రజలు ఇచ్చిన హామీలు మేరకు నూతన జిల్లా లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బాపట్ల ప్రజలచీరకాల కలను ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి నెరవేరచ్ఛారన్నారు
. బాపట్ల జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూతన జిల్లా కలెక్టర్ కె. విజయ మాట్లాడుతూ బాపట్ల జిల్లా లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. ఎక్కడో పుట్టి ఇక్కడ కలెక్టర్ గా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు బాపట్ల ప్రజలకు అభినందలు తెలిపారు. బాపట్ల ప్రజల కు మంచి పరిపాలన అందించడానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు , చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణ మూర్తి, వేమూరి ఎమ్మెల్యే ఎం. నాగార్జున, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, జిల్లా కలెక్టర్ కె. విజయ, జిల్లా ఎస్. పి వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే లు బాచిన చెంచు గరటయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa