పొలిటీషియన్ కమ్ యాక్టర్ ఆర్కే రోజా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు, షూటింగ్ లు బంద్ చేస్తున్నా అంటూ ప్రకటించారు. గత పదేళ్లుగా జబర్తస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు రోజా.దీంతో రోజా బజర్తస్త్ కు గుడ్ బై చెప్పనున్నారు. జగనన్న ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తా అని రోజా ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమా, టీవీషోల్లో కనిపించారు రోజా. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కొత్త క్యాబినెట్ లో రోజాకు మంత్రిగా స్థానం ఖారరైంది. సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు తాను ఎప్పటికీ మర్చిపోనని… నన్ను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వమని చంద్రబాబు అంటే.. జగనన్న నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేసి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారని రోజా ఎమోషనల్ అయింది. మహిళా పక్షపాత సీఎం జగనన్న మంత్రి వర్గంలో ఉండటం నా అదృష్టం అని రోజా అన్నారు.
మంత్రి పదవి రావడంతో రోజా ఇక కొంత కాలం సినిమాలకు, టీవీ షోలకు గుడ్ బై చెప్పనుంది. స్వయంగా రోజానే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటు మంత్రిగా.. అటు యాక్టర్ గా రెండింటికి న్యాయం చేయలేననే ఉద్దేశ్యంతో రోజా సినిమాలు, షూటింగ్ లు ఇక చేయనని చెప్పింది. పూర్తి స్థాయిలో మంత్రి పదవికి న్యాయం చేసేందుకే రోజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు వెండితెర, బుల్లితెరపై రోజాను చూస్తున్న ఆమె అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే. అయితే ఇక మంత్రిగా రోజా పనితీరును అభిమానులు, ఏపీ ప్రజలు ఇప్పటి నుంచి చూడనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa