ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైకి వరుసగా ఐదో ఓటమి

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 14, 2022, 07:26 AM

ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో బ్రెవిస్ 49, తిలక్ వర్మ 36, సూర్య కుమార్ యాదవ్ 43, రోహిత్ శర్మ 28 పరుగులతో రాణించారు. ఈ సీజన్ లో ముంబై కి ఇది వరుసగా ఐదో ఓటమి. తిలక్ వర్మ, పోలార్డ్ రన్ అవుట్ కావడం వల్లే ముంబై గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa