ఏపీ డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్కు జగన్ చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa