ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్పై విమర్శలతో ఏపీ మంత్రి గుడివాడ అమరనాథ్ విరుచుకుపడుతున్నారు. అయితే ఆయన పవన్తో దిగిన ఫొటో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ను విమర్శించే వ్యక్తి ఆయనతో ఫొటోలు దిగాడని నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై మంత్రి అమరనాథ్ సోమవారం స్పందించారు. తాను పవన్తో ఫొటో దిగలేదని, ఆయనే నాతో ఫొటో దిగారని చెప్పారు. కావాలంటే ఫొటో పరిశీలించుకోవచ్చని సూచించారు. తాను దర్జాగా నిలబడితే పవన్ వినయంగా చేతులు కట్టుకున్నారన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తితో తాను ఫొటో దిగడం ఏమిటని ప్రశ్నించారు.
పవన్ ఎవరో తెలియదని ఇతరులలా తాను వ్యాఖ్యానించబోనని మంత్రి గుడివాడ అమరనాథ్ చెప్పారు. వైఎస్ జగన్ అనుచరుడిగా తనకు ఫాలోయింగ్ ఉంటుందని, ఆ కారణంగా చాలా మంది తనతో ఫొటో దిగుతారని పేర్కొన్నారు. పవన్ కూడా అదే కోవలో తనతో ఫొటో దిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అసలు పవన్తో ఎప్పుడు ఫొటో దిగానో కూడా తనకు గుర్తు లేదన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మరింత ట్రోలింగ్ మొదలు పెట్టారు. పవన్తో పోల్చుకుని మంత్రి విర్రవీగుతున్నారని, గతంలో మంత్రి పదవి పొంది పవన్పై వ్యాఖ్యలు చేసిన మాజీల పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa