వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి సాహిత్య సేకరణలో భాగంగా సుమారు నాలుగు వందలకు పైగా రచయితలు, సంకలన కర్తలచే అచ్చువేయించబడిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారికి సంబంధించిన గ్రంథాలను సేకరించడం జరిగింది.
చాలామంది భక్తులు, జిజ్ఞాసువులు ఆ అపురూప గ్రంథ రాజములను దర్శించి విషయ పరిజ్ఞానం పొందాలనే కోరికను శ్రీ వీరబ్రహ్మేంద్ర ఫౌండేషన్ నిర్వాహకులకు వ్యక్తపరచారు. వారి కోరికను మన్నించి అతి త్వరలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు సమాధి నిష్ఠ వహించిన కడప జిల్లా కందిమల్లాయపల్లె లోని శ్రీ కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్ర పౌండేషన్ కార్యాలయంలో అందుబాటులో ఉంచగలమని సవినయంగా తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa