ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ లో విగ్రహ ఆవిష్కరణ చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:21 PM

మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే ఎంఐజీ ప్రాజెక్టును ప్రారంభించడానికి నేడు సీఎం జగన్ విశాఖపట్నం వెళ్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చెయ్యబడిన  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైయస్‌ఆర్‌ పార్కులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తదుపరి సభా ప్రాంగణానికి చేరుకొంటుంటారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa