ఆమదాలవలసల నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పెద్దపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి రామ్ మోహన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఆయన ఆత్మీయ సభలో పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పెద్దపాలెం గ్రామంలో 85కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అరాచక పాలన ఎక్కువైపోయింది. ప్రజలను కాపాడాలంటే, మంచి పరిపాలన కావాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడమే ఏకైక మార్గం అని తెలిపారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త పని చెయ్యాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa