జగన్రెడ్డిని చూసి జనం పారిపోతుండడంతో ఆయనలోని మూర్ఖపు ఫ్యాక్షన్ భూతం నిద్రలేచింది అని నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, జగన్రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అవినీతిని, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్శర్మ బట్టబయలు చేసారు అని తెలియచేసారు. అది మింగుడుపడని వైసీపీ నాయకులూ సాయినాధ్ కారు ధ్వంసం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది అని తెలియచేసారు. జగన్రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుంది. ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారు. జగన్ రెడ్డి గారి సీను కాలిపోయి చాన్నాళ్లయ్యింది. మీ మాటలు బూటకమని, మీ చేతలు నాటకమని జనానికి తెలిసిపోయింది. దుకాణం సర్దుకోండి ఇక. మీ ఆకురౌడీలకి ఎవ్వరూ భయపడరు. సాయినాథ్ శర్మకి అండగా తెలుగుదేశం పార్టీ యావత్తు ఉంది అని భరోసా కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa