రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గమైన పరిపాలనలో బ్రతకలేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని పల్నాడు జిల్లా, నరసరసర్ప్ట్ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక 22 వార్డ్ లోని పాలపాడు రోడ్డులో స్థానిక టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను ప్రజలకు వివరిస్తూ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, కరపత్రాలు పంచిపెడుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు జీవనోపాధి లేక ఆదాయాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోయే పరిస్థితి లో ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో ప్రజలంతా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఏ నాడు చూడలేదు అని ఆవేదన వ్యక్త పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa