తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కోసం టీటీడీ శనివారం ఉదయం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్లను విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో మే 21న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం, అనంతరం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వీధి ఉత్సవం జరుగనుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa