కలవారి ఇంట్లో పుట్టిన బిడ్డైన లేక పెరిగే జంతువైన సరే వీఐపీ కిందకే వస్తారు మరి. ఈ రోజుల్లో అవి వాస్తవంగా మనకు తెలియవస్తున్నాయి. పెంపుడు జంతువులంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. వాటి కోసం వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఓ అధికారిణి తన ఆవు కోసం ఏకంగా ఏడుగురు డాక్టర్లను నియమించింది. ఇప్పుడీ ఈ విషయం వివాదంగా మారింది. ఓ జిల్లా మేజిస్ట్రేట్ ఆవుకు చికిత్స చేసేందుకు ఏడుగురు ప్రభుత్వ పశు వైద్యులను రంగంలోకి దిగారు. ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా మేజిస్ట్రేట్ అనుప్రియా దూబే ఆవు అస్వస్థతకు గురికాగా... ఆవుకు చికిత్స చేసేందుకు ఏడుగురు ప్రభుత్వ పశువైద్యులను నియమించారు.
అస్వస్థతకు గురైన ఆవును ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తనిఖీ చేసి సంబంధిత నివేదికను చీఫ్ వెటర్నరి అధికారికి అందజేయాలని పశువైద్యాధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. డాక్టర్ ఎస్కే తివారీ పేరు మీద ఈ ఉత్తర్వులు జూన్ 9న జారీ చేయబడింది. ఆ ఉత్తర్వులు ఎలా బయటకొచ్చాయో కానీ.. అప్పటి నుంచి అది వైరల్ అయ్యాయి.
2017లో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్కు చెందిన గేదెలు పోయాయి. ఆ గేదెలను గుర్తించేందుకు పోలీసుల బలగాలు రంగంలోకి దిగాయి. ఆ గేదెల కోసం తీవ్రంగా గాలించారు. చివరకు కుక్కల సాయంతో గేదెలను పోలీసులు గుర్తించారు. కాగా ఇటీవల ఐఏఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు వరసగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు క్రీడాకారులను ముందుగానే స్టేడియం నుంచి ఖాళీ చేయించడం వివాదాస్పదం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa