తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ పోలీసులకు అవి వర్తించవు అన్న మాటలు మనం నిత్యం వింటూవుంటాం. బండిపత్రాలు లేవన్న కారణంగా తనకు ఫైన్ విధించిన పోలీస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు ఓ లైన్ మెన్. కానీ ఆ లైన్ మెన్ కూడా ఓ లూప్ లైన్ పట్టుకొని ఇలా వాతపెట్టాడు. దేశంలో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వింత విషయాలకు అడ్డాగా మారింది. అక్కడ తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అక్కడ విద్యుత్లైన్ మాన్కి పోలీసులు చలానా విధించారు. ఇంకెవరైనా అయితే ఆ జరిమానాను చెల్లించేస్తారు. కానీ ఆ లైన్మాన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ప్రతిస్పందించాడు. పోలీసులపైనే రివేంజ్ తీర్చుకున్నాడు.
తనకు చలానా విధించడంతో ఆగ్రహించిన లైన్మాన్ ఏకంగా పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఇది జరిగింది. బరేలీకి చెందిన లైన్మెన్ భగవాన్ స్వరూప్ శనివారం హర్దాస్పూర్ పోలీస్ స్టేషన్ విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. నిజానికి భగవాన్ స్వరూప్ శనివారం హర్దాస్పూర్లో బైక్పై వెళ్తుండగా మోడీ సింగ్ అనే పోలీస్ అధికారి అడ్డుకుని, బైక్ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించమని అడిగారు. అయితే సంబంధిత పత్రాలు తన ఇంటి వద్ద ఉన్నాయని, వాటిని తీసుకొచ్చి చూపిస్తానని చెప్పాడు. దానికి అంగీకరించని ఆ పోలీస్ అధికారి రూ.500 జరిమానా విధించారు.
దాంతో లైన్ మాన్ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే పోలీసు స్టేషన్ కరెంట్ను కత్తిరించాడు. తన సహచరులతో కలిసి ఆ సదరు పోలీస్ అధికారి విధులు నిర్వహించే హర్దాస్పూర్ పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. ఆ పనిని ఎంతో తెలివిగా సమర్థించుకున్నాడు. ఆ పోలీస్ స్టేషన్కు విద్యుత్ మీటర్ లేదని, అక్రమంగా విద్యుత్ను వినియోగించుకుంటున్నారని ఆరోపణలు చేశాడు. ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa