కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జగనన్న తోడు, పిఎం స్వానిధి పథకాల కోసం రుణాలు మంజూరు చేయాలని గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బ్యాంకుల అధికారులను కోరారు. గురువారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో వివిధ బ్యాంకుల అధికారులతో కమీషనర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద1630, పిఎం స్వానిధి ద్వారా 250 మంది లబ్ధిదా రులకు రుణాలు ఇవ్వాల్సి ఉందన్నారు. సమావేశంలో మెప్మా ప్రాజెక్టు అధికారి మోహన్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa