సైనికులకు కూడా మనస్సు ఉంటుంది. అది నొచ్చుకొంటే గాయమవుతుంది. అలాంటి ఘటనే ఇది. ఒక్క రోజు లీవ్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన ఓ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లైట్ మెషిన్ గన్తో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని జోధ్పూర్లో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు జవాన్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు.
జోధ్పూర్లోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రం క్వార్టర్స్లోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న జవాన్ నరేశ్ ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను అడిగాడు. అయితే కొన్ని కారణాల రీత్యా వారు ఇవ్వడానికి నిరాకరించారు. సెలవు మంజూరు చేయలేదు. దాంతో నరేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కోపంతో తన సహద్యోగితో గొడవకు దిగడంతో పాటు అతని చేయిని కూడా కొరికేశాడు. తర్వాత అతడిని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఉపయోగం లేకపోయింది.
తర్వాత అక్కడ నుంచి నరేశ్ నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి తాళం వేసుకుని భార్య, బిడ్డలతో తనను తాను బంధీ చేసుకున్నాడు. అలా 18 గంటలు బందీలా గడిపాడు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్తో కాల్చుకున్నాడు. తనను కాల్చుకున్న సందర్భంలో తన దగ్గరికి ఎవరైనా వస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు నరేశ్తో ఫోన్లో మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
ఈ ఘటనపై జోధ్పూర్ కమీషనర్ రవి గౌర్ మాట్లాడుతూ.. "మేము ఆదివారం సాయంత్రం నుంచి నరేష్తో మాట్లాడటానికి ప్రయత్నించాం. అతని తల్లిదండ్రులను కూడా పాలి నుంచి పిలిపించాం. అయితే అతను గడ్డం మీద మెషిన్ గన్తో కాల్చుకున్నాడు. కారణాలు ఇంకా తెలియలేదు. దర్యాప్తు చేయాలి." అని అన్నారు. అయితే అతని భార్య, కుమార్తె ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కమిషనర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa