అవసరమైన చోట వరద సహాయక శిబిరాలు తెరవాలని అధికార్లకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలని.. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలి అన్నారు. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందని.. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి అన్నారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని.. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేశారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలపై సూచనలు చేశారు. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని.. జులై నెలలోనే రూ.10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చింది అన్నారు. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని.. రేపు ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి అన్నారు.
మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరినదికి వరదలు కొనసాగే అవకాశం ఉందన్నారు సీఎం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని.. కూనవరం, చింతూరులో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి అన్నారు. కంట్రోలు రూమ్స్ సమర్థవంతంగా పనిచేయాలని.. వీ.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి అన్నారు. లైన్ డిపార్ట్మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి అన్నారు.
తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు. కరెంట్ సరఫరాకు అంతరాయం రావడంతో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు. తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలి అన్నారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, ఇరిగేషన్కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ సబ్స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. అల్లూరు సీతారామరాజు, ఈస్ట్గోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నామన్నారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa