భారీ వర్షాల కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతున్న సమయంలో కడప శివారు ప్రాంతంలో మృతదేహాలు కలకలంరేపాయి. నగర శివారు గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో మూడు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘాట్రోడ్డులోని ఐదో మలుపు వద్ద గుర్తు తెలియని మహిళ, ఇద్దరు పురుషులు మృతదేహాలు కనిపించాయి. అక్కడి చెరువులో మరో మృతదేహం ఉందన్న అనుమానంతో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.
మూడు మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. వీరు వారం క్రితం చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరే ప్రాణాలు తీసుకున్నారా.. ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa