అనంతపురం జిల్లా పరిధిలోని బుక్కరాయ సముద్రం మండలం నీలంపల్లి, చెదళ్ల గ్రామాలలో పోలీసులు ఈరోజు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు సి.ఐ రాము ఆధ్వర్యంలో సిబ్బంది సంయుక్తంగా పాత కేసుల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. గ్రామసభ నిర్వహించి నేరాల జోలికెళ్లకుండా సత్ప్రవర్తనతో జీవించాలని... పాత పంథాకు వెళితే చట్టం గట్టిగా పని చేస్తుందని హెచ్చరించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లరాదని, CCTV ఏర్పాటు చేసుకోవాలని మరియు దిశ యాప్ పై అవగాహన చేశారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa