విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, గారి ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ దామోదర్ మరియు ఇతర ట్రాఫిక్ పోలీసు సిబ్బంది జూలై 21న ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించి, ఎం.వి.నిబంధనలు పాటించాలని కోరారు. జూలై 22న ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు గారు ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, అతివేగంతో వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేసే స్థలంలో కుటుంబ సభ్యుల ఫొటో పెట్టుకోవాలని సూచించారు. మనలని నమ్ముకొని మన కుటుంబం ఉంది అని గుర్తు పెట్టుకోవాలని. అలానే మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, రాంగ్ డ్రైవింగ్ లాంటివి చెయ్యకీడదని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa