ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లికార్జున ఖర్గే మరోమారు కరోనా

national |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 01:45 PM

ప్రముఖులను కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయన ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా కరోనాకు గురయ్యారు. అప్పట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి కోలుకున్నారు. కొన్నినెలల వ్యవధిలోనే ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన నిన్న రాజ్యసభలో వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. కాగా, తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa