కేథరిన్ థ్రెసా.. నాని హీరోగా వచ్చిన 'పైసా' సినిమాలో హీరోయిన్గా చేసి.. అదరగొట్టన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్తో 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ పాత్ర చేస్తోంది. నటుడు బాలకృష్ణ త్వరలో బోయపాటి శీనుతో కలిసి మాస్ మసాల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు . ఇందులో బెంగళూరు భామ కేథరిన్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా కోసం కోటి రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది. గతంలో బోయపాటి శీను తెరకెక్కించిన సరైనోడు, జయ జానకి నాయక చిత్రాలలో కేథరిన్ రెండో హీరోయిన్గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa