2020 యేడాదికి గాను కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో సినీ రంగం నుంచి మొత్తంగా ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. కంగనా, కరణ్ జోహార్,ఏక్తా కపూర్, అద్నన్ సమీ,సురేష్ వాడ్కర్ అందరు దాదాపు బాలీవుడ్ వాళ్లే కావడం విశేషం. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్కు పద్మశ్రీ అవార్డు వరించింది. చిత్ర పరిశ్రమకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం కంగనను ఈరకంగా సత్కరించింది. ఆమెకు అవార్డు అంత తేలికగా రాలేదు. ఆమె ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఎన్నో కలలు కని వాటిని సాకారం చేసుకోవాలనే కోరికతో అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కంగనా. హీరోయిన్ గా ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కంగన సోదరి రంగోలీపై యాసిడ్ దాడి జరిగింది. తన అక్కకు మెరుగైన చికిత్స అందించడానికి కంగన చెత్త సినిమాల్లో నటించాల్సి వచ్చిందట. ఏ పాత్రకైనా ఒప్పుకుంటానని చెప్పేది. దాంతో దర్శకులు కంగనను అప్పుడు కేవలం రొమాంటిక్ సన్నివేశాల కోసమే తీసుకునేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టు పట్టిన విక్రమార్కుడిలా సినిమా కోసమే పోరాడింది. కట్ చేస్తే రొమాంటిక్ సన్నివేశాలు చేసి పొట్ట నింపుకున్న కంగనా ఇప్పుడు హీరో కూడా లేకుండా సోలోగా తన సినిమాను ఒక్కోమెట్టు ఎక్కింస్తుంది. తన కోసం దర్శకులు క్యూ కట్టే స్థాయిలో అందనంత ఎత్తులో నిలబడింది.ఆమె పడ్డ కష్టాన్ని, ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa