ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ కోసం వైజాగ్ పయనమైన వరుణ్ తేజ్....

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 07:30 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరో గా, రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమా  భీష్మ ఈ మంచి సక్సెస్ ని సాధించింది. ప్రస్తుతం భీష్మ మూవీ టీమ్ మంచి జోష్‌లో ఉంది. తమ సినిమాకు ఆశించిన ఫలితం రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు యూనిట్ సభ్యులంతా. ఇది అంత ఒక ఎత్తు అయితే , టాలీవుడ్ హీరోల మధ్య  పోటీ సంగతి పక్కన బెడితే ఒకరి సినిమా కోసం మరొకరు తమ వంతు సహకారం అందిస్తూ తెలుగు చిత్రసీమలో ఉన్న ఫ్రెండ్లీ వాతావరణాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో నితిన్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైజాగ్ పయననానికి సిద్దమయ్యాడు. నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ భారీ సక్సెస్ సాధించింది. ఈ మేరకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు గాను ఫిబ్రవరి 29వ తేదీన వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో భీష్మ థాంక్స్ మీట్ నిర్వహించబోతోంది చిత్రయూనిట్. అత్యంత గ్రాండ్‌గా నిర్వహించనున్న ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa