పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పింక్ సినిమా రీమేక్ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తైపోయింది. మార్చ్ తొలి వారంలో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. దాంతో సినిమా షూట్ పూర్తి కానుంది. మరోవైపు జనసేనాని కూడా ఇంకా లోపల అలాగే ఉన్నాడు. సినిమాలు చేస్తున్నాడు కదా అని జనసేనానిని మనసులోనే తొక్కేయడం లేదు పవన్ కల్యాణ్. ఆయన పనులు ఆయన కూడా చేస్తున్నాడు. అమరావతి రైతుల కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జనసేన అధ్యక్షుడు. మరోవైపు సినిమా హీరో పవన్ కల్యాణ్ మాదిరి పింక్ సినిమా రీమేక్ షూటింగ్ చేసుకుంటున్నాడు.
రెండు పాత్రలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు ఈయన. గత నెల రోజులుగా అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు పవర్ స్టార్. షూటింగ్ నుంచి నేరుగా మళ్లీ జనసేన కార్యాలయానికి వెళ్లి మిగిలిన కార్యక్రమాలు చూసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. రైతుల కోసం ప్రత్యేకంగా మరో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాడు పవన్. తనకు చేతనైనంత వరకు రైతుల కోసం పోరాడతా అంటూ మాటిస్తున్నాడు జనసేనాని.
మరోవైపు సినిమాకు కూడా డేట్స్ ఇచ్చాడు ఈయన. పింక్ రీమేక్ కోసం కేవలం 25 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ఏకంగా 40 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈయన. మే 15న సినిమా విడుదల కానుంది. దాంతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు కూడా లైన్లో పెట్టాడు పవర్ స్టార్. మొత్తానికి అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడు పవన్. మరి అదెంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa