ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ కార్మికులకు రాజమౌళి విరాళం..

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 03:26 PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే.. మరోవైపు దీనివల్ల నష్టపోతున్న ప్రజలను, బాధితులను ఆదుకోడానికి తమ వంతు సాయంగా మన హీరోలు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.. ఇంకా ఇస్తున్నారు కూడా. ఇప్పటికే ప్రభాస్ 4 కోట్లు.. పవన్ 2 కోట్లు.. అల్లు అర్జున్ కోటి 25 లక్షలు.. మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున కోటి రూపాయలు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ 75 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాంతో పాటు ప్రత్యేకంగా కరోనా క్రైసస్ ఛారిటీకి కూడా లక్షలకు లక్షలు విరాళంగా ఇస్తున్నారు.దీనికి కూడా చరణ్ 30 లక్షలు.. ఎన్టీఆర్ 25 లక్షలు.. నాగార్జున, చిరంజీవి కోటి.. మహేష్ బాబు 25 లక్షలు.. రవితేజ, వరుణ్ తేజ్ 20 లక్షలు.. శర్వానంద్ 15 లక్షలు ఇలా చాలా మంది సాయం చేసారు. రాజమౌళి కూడా ఇప్పుడు ప్రకటన చేసాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఆర్థిక సాయం అందించాడు రాజమౌళి. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి దేశసేవ చేయాల్సిన సమయం వచ్చేసింది.. అదే చేయాలి.. చేస్తున్నారు కూడా అని చెప్పాడు దర్శక ధీరుడు.రాజమౌళి కూడా తన వంతుగా పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు. వాటిని రీ సైకిల్ చేసుకుని వాడుకోడానికి కూడా ఉండదు కాబట్టి అవి దొరకడం కూడా కష్టమవుతున్నాయి. అందుకే తమ టీం అంతా కలిసి భారీగా ఫేస్ మాస్కులతో పాటు ప్రొటెక్టర్స్ కూడా అందించాడు. ఆర్థికంగా కూడా రాజమౌళి సాయం ప్రకటించాడు. తన నిర్మాత డివివి దానయ్యతో కలిసి సినిమా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన CCCకి 10 లక్షల విరాళం ప్రకటించాడు దర్శక ధీరుడు. చిరంజీవి అధ్యక్షతన ఈ కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa