ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన రష్మికమందన

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 16, 2020, 07:01 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పలువురు ప్రముఖులు మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దీనిని ప్రారంభించారు. ఇటీవల ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత మొక్కనాటి హీరోయిన్ రష్మిక మందనకు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన రష్మిక మొక్కలు నాటింది. హీరోయిన్లు రాశిఖన్నా,కళ్యాణి ప్రియదర్శన్ లకు రష్మిఖ ఛాలెంజ్ విసిరారు. అదే విధంగా తన అభిమానులు,యువత పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రష్మిక పిలుపునిచ్చారు. తనను ఈ ఛాలెంజ్ లోకి ఆహ్వానించినందుకు సమంతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa