ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాతో ప్రముఖ సినీ నటుడు మృతి..

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 01:16 PM

భారతదేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. దేశపౌరులపై మృత్యుపంజా విసురుతోంది. ఈ మహమ్మారి ఇప్పటికే వందలాది మందిని బలితీసుకుంటుంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీలు..ప్రజాప్రతినిధులు ఇలా ఎవర్నీ కరోనా వదలడం లేదు. తాజాగా మరో సినీనటుడుని కరోనా బలి తీసుకుంది. తమిళం, మళయాలంలో నటించిన నటుడు ఫ్లోరెంట్ పెరిరా కరోనాతో మృత్యువాతపడ్డారు. ఫ్లోరెంట్ పెరిరా తమిళ , మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెరిరాకు మంచి ఇమేజ్ ఉంది. ఈయన రాజా మంతిరి, ధర్మదురై, తోడరి, ముప్పారిమనమ్, సత్రియాన్ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు. ఫ్లోరెంట్ పెరిరా మృతికి తమిళనాడుకు చెందిన సినీనటులుతో పాటు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa