ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్దలకొండ గణేష్' హీరోయిన్ కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా

cinema |  Suryaa Desk  | Published : Fri, May 21, 2021, 08:27 AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఏ కుటుంబంలో చూసినా.. కరోనా టెన్షనే నెలకొంది. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ డింపుల్‌ హయాతి ఇంట్లో అలజడి సృష్టిస్తోంది. హయాతి కుటుంబంలో ఏకంగా పదిమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిది. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతోంది. కోవిడ్‌ బారిన పడిన తన తాతయ్య ప్రస్తుతం చెన్నైలోని ఐసీయూలో పోరాడుతున్నారని హయాతి ఆవేదన వ్యక్తం చేసింది.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడులో తమది ఉమ్మడి కుటుంబంమని.. ఇంట్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ తేలిందని పేర్కొంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నాం. గత వారం రోజులుగా శారీరకంగా, మానసికంగా కష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది.. అంటూ డింపుల్ హయాతి పేర్కొంది.


 


లాక్‌డౌన్ కారణంగా ఆమె ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే ఉంది. అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఆమె ఇక్కడే ఇరుక్కుపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యుల వెంట లేనందుకు డింపుల్ బాధపడుతోంది.


కాగా.. డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్‌ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డింపుల్‌ హయాతి రవితేజతో ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు ఆమె పలు తమిళ చిత్రాల్లో సైతం నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa