సినిమా తారలు ఏంచేసినా అది వార్తే.. చిన్న పని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చేసిన పని కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ ముద్దుగుమ్మా ఎవరు.. అసలు ఏం చేసింది అనుకుంటున్నారు. నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతోయ్ హీరోయిన్ గా పరిచయమైంది ముద్దుగుమ్మ నివేదా థామస్. మొదటి సినిమాతోనే నటనతో.. క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత నివేదా థామస్కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన సినిమాన్నీ చేసుకుంటూ పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంది. ఈ క్రమంలోనే జెంటిల్మెన్ సినిమా తర్వాత నానితో కలిసి నిన్నుకోరి, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ.. రీసెంట్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'వి' సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు తమిళ్లోనూ అవకాశాలు అందుకుంటుంది. మురగ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్భార్ సినిమాలో రజినీకాంత్ కూతురుగా నటించింది నివేద. ఇక ఇప్పుడు భామ తెలుగుతోపాటు తమిళ్లోను రెండు మూడు సినిమాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా నివేదా పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. స్వయంగా ఆవు పాలు పితుకొని చక్కటి కాఫీ పెట్టుకుంది. ఈ తతంగాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొంతమంది ముద్దుగుమ్మలు ఆవు దగ్గరకు వెళ్ళడానికే భయపడుతుంటారు.. ఒకవేళ వెళ్లినా పాలు పితికే సాహసం చేయరు. కానీ నివేదా మాత్రం ఇలా పాలు పితుకుతూ కనిపించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa