ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూర్తిగా కోలుకున్న మెగా మేనల్లుడు

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 27, 2021, 03:00 PM
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ .. గత నెల్లో బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్ లో దాదాపు నెలరోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయన.. ఇటీవల డిస్జార్జ్ అయ్యారు. అప్పటి నుంచి ఇంటిదగ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై ఓ ప్రత్యేక అప్డేట్ వచ్చింది. సాయిధరమ్ గాయాల నుంచి పూర్తిగా కోలుకుని.. ఇప్పుడు నార్మల్ పొజీషన్ కు చేరుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ ట్రీట్ మెంట్స్ లో ఉన్నారట. ఆయన ముఖంపై తగిలిన గాయాలు తగ్గుముఖం పట్టడంతో. కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాడీని పూర్తి కండీషన్‌లోకి తెచ్చుకొని.. త్వరలోనే కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

ఇటీవల 'రిపబ్లిక్' సినిమాతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్.. తదుపరిగా ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖాయం చేయలేదు. కొత్త దర్శకుడు కార్తిక్ దండు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సుకుమార్ స్ర్కీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మొన్నామధ్య అనౌన్స్ మెంట్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే లాంఛ్ కాబోతోంది. ఆపై లేట్ చేయకుండా.. సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa