సినిమా టికెట్ రేట్ల వ్యవహారం థియేటర్లు మూసివేత అంశాలు గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఐన జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని మాట్లాడారు. టికెట్ రేట్లు తగ్గడం వలన నష్టపోయేది హీరోలు కాదని, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే అని ఆర్జీవీ అన్నారు.
దీనిపై మా అసోసియేషన్ ప్రసిడెంట్ మంచు విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ విషయమై కనీసం ఓ ట్వీట్ కూడా చేయకపోవడం వలన ఇతనిపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ తో బంధుత్వం వల్లే విష్ణు మౌనం వహిస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇండస్ట్రీ సమస్యలపై ప్రశ్నించే హక్కు, భాద్యత విష్ణుకు ఉంది.
సినీ పరిశ్రమలో నెలకొన్న అంశాలపై పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వల్ల ఇండస్ట్రీలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలకు ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకోవాల్సి పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో 'మా' అధ్యక్షుడు తెలివిగా వ్యవహరించి, సమస్య పరిష్కారానికి పూనుకుంటే బాగుండేదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa