కార్తీ నటించిన 'ఖైదీ' ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, దీనికి లోకేష్ కనగరాజ్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2019 సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాలో నరైన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ ధీనా కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్కి మార్గం సుగమం చేసేలా సినిమా చివరి సన్నివేశాలను ఏర్పాటు చేశారు. సినిమా సక్సెస్ మీట్లో కార్తీ, లోకేష్ కనగరాజ్ మరియు నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఖైదీకి సీక్వెల్ ఉంది అని తెలిపారు. ప్రస్తుతం కమల్హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘విక్రమ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా పనులు పూర్తికాగానే సీక్వెల్ను ప్రారంభించనున్నారు. 2022 మధ్యలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa