శాండల్వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర అండ్ కిచ్చా సుదీప్ ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే.ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'కబ్జా' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.ఇద్దరు తెలుగు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.ఈ పాన్ ఇండియా మూవీలో మురళీ శర్మ,పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తారని 'కబ్జా' టీమ్ వెల్లడించింది.శ్రియా శరణ్,ప్రకాష్ రాజ్,జగపతి బాబు,ఎం కామరాజ్,కబీర్ దుహన్ సింగ్,బొమన్ ఇరానీ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ ఏ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 7 భారతీయ భాషల్లో విడుదల కానుంది.రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa