ట్రెండింగ్
Epaper    English    தமிழ்

' టైగర్ నాగేశ్వరరావు' షుటింగ్ త్వరలోనే ప్రారంభం

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 10:01 PM

రవితేజ తన సినిమాల రూపకల్పనలో వేగం పెంచుతున్నాడు. తాజాగా రవితేజ కథానాయకుడిగా ' టైగర్ నాగేశ్వరరావు' సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను రేపు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు వుంటారు. ఒక కథానాయికగా నుపుర్ సనన్ ను ఎంపిక చేసిన టీమ్, తాజాగా గాయత్రి భరద్వాజ్ ను కూడా తీసుకున్నట్టుగా ప్రకటిస్తూ ఆమె ఫొటోను వదిలారు. ఈ ఢిల్లీ బ్యూటీ అందాల పోటీల్లో పలుమార్లు విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి పరిచయమవుతోంది.  ఇటీవల రవితేజ వరుసగా ఇద్దరు హీరోయిన్ల కథలతో సందడి చేస్తున్నాడు. 'ఖిలాడి'లో మీనాక్షి చౌదరి - డింపుల్ హయతితో ఆడిపాడిన ఆయన, 'రామారావు ఆన్ డ్యూటీ'లో దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ తో కలిసి పలకరించనున్నాడు. ఇక 'టైగర్ నాగేశ్వరరావు'తోను ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa