ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 ఏళ్లుగా ప్రశాంత్ నీల్ అభిమానిస్తున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా!

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:20 PM

2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. మాస్ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేసారు. పాన్ ఇండియా రేంజులో ఆ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కేజీఎఫ్ కు రెండో భాగంగా రానున్న చాప్టర్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ కార్యక్రమాలను ఎంతో భారీగా నిర్వహిస్తున్నారు. 


ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ...  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయార్ గత 20 ఏళ్లుగా నా అభిమాన హీరో. ఇప్పటివరకూ ఆయన్ను ఒక 10-15 సార్లు కలిసా. త్వరలొనే ఆయనతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాను. స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది. కానీ ఎలాంటి సినిమా మాత్రం అని అడగొద్దు.... అంటూ ప్రేక్షకులతో పాటు మీడియాను కూడా సస్పెన్స్ లో ఉంచారు. 


పోతే.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ పట్టాలెక్కుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa