వైసిపి తరఫున రెండు సార్లు నగరి ఎమ్మెల్యే గా గెలుపొందిన నాయకురాలు, సీనియర్ సినీ నటి రోజా కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు లభించింది. ఇంకాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న రోజా ఒక సంచలన ప్రకటన చేసారు. సినిమాలకు, షూటింగులకు ఇక పూర్తిగా దూరమవుతున్నానని, తన పూర్తి సమయాన్ని మంత్రి పదవికే వెచ్చిస్తానని ప్రకటించి రోజా తన అభిమానులను ఒకింత నిరాశ పరిచారు. అయినప్పటికీ తమ అభిమాన నటి , నాయకురాలు, ప్రత్యర్థుల పట్ల ఫైర్ బ్రాండ్ అయిన రోజా కు మంత్రి పదవి రావటంతో ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
తన సేవలను, అంకితభావాన్ని గుర్తించి మంత్రి పదవినిచ్చిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రోజా కృతజ్ఞతలు తెలియజేసారు. తనకు ఏ మంత్రి వర్గాన్ని కేటాయించినా సమర్ధవంతంగా చేసుకొస్తానని, సీఎం కు మంచి పేరు తీసుకొచ్చేలా పని చేస్తాననీ రోజా చెప్పుకొచ్చారు. సీఎం పై అభిమానం మరింత రెట్టింపైందని, ప్రాణం ఉన్నంతవరకూ జగనన్న కోసం పనిచేస్తానని రోజా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa