ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూనియర్ ఎన్టీఆర్ రామాయణం కు నేటితో పాతికేళ్ళు...

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 03:33 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం "బాల రామాయణం". 1996 ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా నేటితో పాతికేళ్ళను పూర్తి చేసుకుంది. ప్రఖ్యాత దర్శకుడు కమలాకర కామేశ్వరరావు 1972 లో తెరకెక్కించిన బాల భారతం సినిమాను ఇన్స్పైర్ గా తీసుకుని 1996లో గుణశేఖర్ బాలనటులతో రామాయణాన్ని తెరకెక్కించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ యంగ్ రాముడిగా నటించారు. సీతగా స్మితా మాధవ్ నటించింది. ఆ రోజుల్లోనే 5కోట్ల షేర్ ను రాబట్టి ఈ మూవీ వార్తల్లో నిలిచింది. చిన్న పిల్లలతో చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయస్థాయి అవార్డు దక్కింది. 
బాలరాముడిగా తారక్ నటించిన తీరు ప్రశంసనీయమైంది. తాతకి తగ్గ మనవడిని అనిపించుకోవటంతో పాటు భవిష్యత్తులో ఉత్తమనటుడిగా జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపై వెలిగిపోతాడని అందరూ మెచ్చుకున్నారు. అలానే తారక్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa