మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153 వ చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. చిరు 153 వ చిత్రంగా ఆచార్య రానుండటంతో ఈ మూవీ ట్రైలర్ ను 153 ప్రఖ్యాత థియేటర్లలో రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేసారు. అపజయమే ఎరుగని కొరటాల శివ ఖాతాలో ఒక మెగా హిట్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ట్రైలర్ విడుదల తర్వాత కొరటాల ఒక కాంట్రవర్సీ ని ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది.
అదేంటంటే... ఆచార్య మెయిన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్రైలర్ లో ఎక్కడా కనిపించదు. కానీ పూజా హెగ్డే కు మాత్రం ట్రైలర్ లో మంచి స్క్రీన్ స్పేస్ దక్కింది. దీంతో కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొరటాలను ఒకరేంజులో ఆడుకుంటున్నారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజులో చాలా కాలం పాటు సినీ ఇండస్ట్రీ ని ఏలిన కాజల్ అగర్వాల్ కు ఆచార్య మూవీ లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇటీవలి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజాకు హైప్ ఇచ్చారని, కొరటాల పక్షపాత ధోరణి చూపించారని కాజల్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ట్రైలర్ దేముంది... సినిమా చూసి ఒక అభిప్రాయానికి రావాలి అని మరికొంతమంది కొరటాలను సపోర్ట్ చేస్తున్నారు. పోతే... భారీ అంచనాల నడుమ ఆచార్య మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటిసారిగా వెండితెరపై ఎక్కువసేపు కలిసి కనబడనున్న చిరు,చరణ్ లు మెగా మ్యానియా ను సృష్టించడం ఖాయమే అని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa