ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆచార్య కు స్పెషల్ హైక్... జగన్ తప్పును ఎత్తిచూపుతున్న నెటిజన్లు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 03:15 PM

ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలకు టికెట్ రేట్లను పెంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే విధానాన్ని మెగాస్టార్ 153వ చిత్రానికి కూడా అవలంబిస్తున్నారు. టికెట్ రేట్లను రూ. 50 వరకు పెంచుకోవచ్చని ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లకు, ఎక్సిబిటర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల టాక్ తో సంబంధం లేకుండా  ఆచార్యకు భారీ వసూళ్లు రావటం ఖాయం. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. 


దారుణంగా పెరిగిపోతున్న టికెట్ రేట్లను అదుపుచేయాలని దేశంలోనే ముందస్తు చర్యలు చేపట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే దీని వల్ల పెద్ద సినిమాలు నష్టం చూస్తున్నాయి కాబట్టి టికెట్ రేట్లను సవరిస్తూ కండిషన్లతో కుడిన ఒక జీవో ను ఇటీవలనే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం, నటీనటుల పారితోషకాలను తీసేసి, కేవలం సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటాలి. 20శాతం షూటింగును ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకోవాలి. అలాంటప్పుడే ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునే వీలుంటుంది. అయితే 100కోట్లు బడ్జెట్ దాటని ఆచార్యకు టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటును కల్పించినందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోతే... ఏపీలోని మారేడుమిల్లి అడవులలో 25 రోజులపాటు ఆచార్య షూటింగ్ జరిగింది. చిరంజీవి పై జగనన్నకున్న సానుకూల దృక్పధమే ఇందుకు కారణమని కొంతమంది అంటుంటే మరికొంతమందేమో ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డికి, జగన్ కు ఉన్న సాన్నిహిత్యం వల్లనే ఇలా జరిగింది అని అంటున్నారు. జగన్ పై ఉన్న పలు సీబీఐ కేసులను నిరంజన్ రెడ్డి నే కోర్టులో వాదిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా నిరంజన్ నిర్మిస్తున్న ఆచార్య టికెట్ రేట్లను జగన్ పెంచారు అని అంటున్నారు.ఏది ఏమైనా భీమ్లానాయక్, కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఇవ్వని స్పెషల్ హైక్ ను జగన్ ఆచార్యకు ఇవ్వడం తో సోషల్ మీడియాలో భీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa