ఎన్నో మూవీ ఈవెంటులను, టాక్ షోలను, లైవ్ షోలను, రియాలిటీ షోలను ఒంటిచేత్తో నడిపించి, వాటిని సూపర్ సక్సెస్ చేసిన ఏకైక టెలివిజన్ హోస్ట్ సుమ కనకాల. తాజాగా వెండితెరపై సందడి చేయటానికి సిద్దమవుతుంది. వాస్తవానికి సుమ నటిగానే తన సినీ కెరీర్ను ప్రారంభించింది. అనుకోకుండా యాంకర్ అయ్యి టెలివిజన్ చరిత్రలో తిరుగులేని స్థానం సంపాదించుకుంది. విజయ్ కలివరపు డైరెక్షన్లో సుమ కనకాల లీడ్ రోల్ లో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం జయమ్మ పంచాయితీ. మే 6న విడుదల కాబోతుంది. ఈ మేరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని పాల్గొని చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమాకు మొదటి నుండి స్టార్ సెలెబ్రిటీలు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఎప్పటినుండో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను, ఇంటర్వ్యూలను ఎడతెరిపి లేకుండా, ఏకధాటిగా నిర్వర్తిస్తున్న సుమకు ఈ క్రమంలో పెద్ద స్టార్స్ తో మంచి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వారందరికీ సుమ మీద ఉన్న గౌరవాభిమానాలతో జయమ్మ పంచాయితీకి తగినంత ప్రచారం చేసారు. దీనివల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల చాలా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తన సేవలను నిర్విరామంగా, నిస్వార్ధంగా నిర్వర్తించి టాలీవుడ్ కు ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు టాలీవుడ్ వంతు. ఆమె చేసిన దానికి కొంతైనా తిరిగివ్వాలనుకుంటుంది. అందుకే ఆమె అడిగిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కాదనకుండా జయమ్మ పంచాయితీ ట్రైలర్ ను లంచ్ చేసారు. మరి ప్రేక్షకులు కూడా ఇంతకాలం తమను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన సుమ ను ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa