పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 'సర్కారు వారి పాట' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న గ్రాండ్ గా జరగనుంది. మే 7వ తేదీన హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది అని సమాచారం. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa