ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరుకానున్నది ఎవరు?

cinema |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 12:12 PM

పరశురామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా మే 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 'సర్కారు వారి పాట' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 7న గ్రాండ్ గా జరగనుంది. మే 7వ తేదీన హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది అని సమాచారం. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బ్యాంకింగ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ 'సర్కారు వారి పాట' సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa