ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పుస్తకాన్ని చదవండంటూ...అభిమానులకు రాంచరణ్ సూచన

cinema |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 04:51 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం RC #15 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో కియారా అద్వానీ కధానాయిక. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, పంజాబ్ లలో మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా వైజాగ్ లో నాల్గవ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. 


తాజాగా రాంచరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పుస్తకం గురించి ట్వీట్ చేసాడు. సందీప్ ఎం భట్నాగర్ రచించిన ఆఫ్ స్ప్రింగ్ నవలను చదువుతున్న రాంచరణ్ అభిమానులను కూడా చదవమని సూచించాడు. సంప్రదాయాలు, కుటుంబం, ప్రేమ ... ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని విషయాలను, అందువల్ల మనం ఎదుర్కొనే పరిస్థితులను పదునైన కధల ద్వారా ఈ పుస్తకం వివరిస్తుంది. న్యూయార్క్ లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ గా పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది ఇమ్మిగ్రెంట్స్ ను చాలా దగ్గరుండి చూడటం వల్లనే సందీప్ ఈ ఆఫ్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa