బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన రాబోయే చిత్రం "దృశ్యం 2" షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇది మలయాళం దృశ్యం 2 బ్లాక్ బస్టర్ మూవీకి అధికారిక రీమేక్. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా ద్వారా మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. ఇదే విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్, ఇషితా దత్తా, టబు, రజత్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.