ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నటి గీతిక రతన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 10:34 AM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ లో జీహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటిన నటి గీతిక రతన్. ఈ సందర్భంగా నటి గీతిక రతన్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. బావి తరాలకు మంచి ఆక్సీజన్ ఇవ్వాలన్న, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటవలసిన అవసరం ఉందని ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపి ఉత్తర రెడ్డి, సుమయా రెడ్డి, సాయి కృష్ణ ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa