బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలే "ధాకడ్" సినిమాతో ప్రేక్షకులను పలకరించి, వారిని మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. తదుపరి పీరియడ్ పొలిటికల్ డ్రామా "ఎమర్జెన్సీ" తో కంగనా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశేషమేంటంటే, ఈ సినిమాకు కథ అందించింది, డైరెక్ట్ చేసింది కంగనానే.
ఈ మూవీని ఎనౌన్స్ చేస్తూ కొంచెంసేపటి క్రితమే చిన్న టీజర్ విడుదలైంది. అందులో ఇందిరాగాంధీ రోల్ లో కంగనా స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచి, ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 1975 - 1977 వరకు అంటే దాదాపు 21 నెలల పాటు సాగిన నిర్బంధం (ఎమర్జెన్సీ) లో ప్రపంచానికి తెలియని ఎన్నో నిజమైన సంఘటనలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రితేష్ షా డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మణికర్ణికా ఫిలిమ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్, రేణు పిట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa