ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ తగ్గడం వల్లే ఆదికి పేరొచ్చిందా..? దీనిపై ఆది తండ్రి ఏమన్నారంటే..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 05:00 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన "సరైనోడు" చిత్రంలో వైరం ధనుష్ గా నటించి తనలోని మాస్ విలనిజాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసాడు హీరో ఆది పినిశెట్టి. తదుపరి పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" లో విలన్ గా నటించిన ఆది అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ విలన్గా నటించలేదు.
తాజాగా హీరో రామ్ కొత్త చిత్రం "ది వారియర్" లో ఆది గురు అనే పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించి ప్రేక్షకులను మరోసారి థ్రిల్ కు గురి చేసారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ స్టైలిష్ పెర్ఫార్మన్స్ గురించి, ఆది క్రూయల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకులందరూ ఆది విలనిజాన్ని ఒక రేంజులో పొగిడేస్తుంటే, ఆది తండ్రి, వెటరన్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి మాత్రం రామ్ తగ్గడం వల్లే ఆదికి ఇంత మంచి పేరొచ్చిందని, ఇదంతా రామ్ గొప్పతనమని, క్రెడిట్ మొత్తం రామ్ కే కట్టబెట్టేశారంట. ఈ విషయాన్ని స్వయంగా ఆది సినిమా విడుదల తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యాస ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే బావుణ్ణేదని కూడా సజెస్ట్ చేసారంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa